జనం కోసం జనసేన 561వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 561వ రోజు కార్యక్రమంలో భాగంగా మన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గురువారం గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 650 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 93910 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 562వ రోజు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటల నుండి రాత్రి 9 గంట వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నామని తెలిపారు. గురువారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ గారికి, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు యరమళ్ళ రాజు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, మల్లేపల్లి నుండి శ్రావణం ఆదిత్య, పచ్చిపాల అర్జున్, చిత్రాడ నవీన్ కుమార్, వల్లభసెట్టి రాంపండు, నూకలబంటి నాగేంద్ర, మల్లబత్తుల బాలు, బత్తుల రామకృష్ణ, గొల్లపల్లి విజయ్ (పండు), పట్టెం విష్ణు, కొత్తపల్లి నుండి మాదారపు ధర్మేంద్ర, వనుం వెంకటేష్, బూరుగుపూడి నుండి పాటంశెట్టి చిన్న రామకృష్ణ, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి నాని, జలిగంపల శ్రీను పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.