“జనసేన – పల్లెబాట” కార్యక్రమం 7వ రోజు

పర్చూరు, జనసేన పార్టీ పర్చూరు నియోజకవర్గంలో 7వ రోజు పర్యటన పర్చూరు మండలం చెరుకూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ మరియు పర్చూరు నియోజకవర్గయువ నాయకులు శ్రీకాంత్ ఇంటింటికి తిరిగి జనసేన పార్టీని 2024లో అధికారాన్ని తీసుకురావాలని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. కార్యక్రమంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి శంకరశెట్టి చిరంజీవి, సంయుక్త కార్యదర్శి షేక్ ఇంతియాజ్, ఇంకొల్లు మండల అధ్యక్షులు నారిసెట్టి ప్రవీణ్ కుమార్, కారంచేడు మండల అధ్యక్షులు సాగిరి శ్రీనివాసరావు, యద్దనపూడి మండల అధ్యక్షుడు అయ్యప్ప, చెరుకూరి నాయకులు అంచ రామకృష్ణ, ముత్యాల వెంకటేష్ తిరిగే క్రమంలో జనసేన పార్టీ సిద్ధాంతాలు వచ్చే గుద్దటి శ్రీనివాసరావు 30 మంది అనుచరులతో జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో పసుపులేటి రవికాంత్, తోట అశోక చక్రవర్తి, రామకృష్ణారెడ్డి, కుప్పల మహేష్, కొండపల్లి వెంకటేశ్వరరావు, లవ్లీ గోపి, ఉప్పుటూరు సిద్దు తదితరులు పాల్గొన్నారు.