కిడ్నీ వ్యాధి బాధితునికి జనసేన సాయం

పి.గన్నవరం: మామిడికుదురు మండలం, పెదపట్నం లంక గ్రామానికి చెందిన పల్లి ఏడుకొండలు కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడని తెలిసి పెదపట్నంలంక గెడ్డంవారి పేటకు చెందిన విదేశాలలో ఉంటున్న జనసేన పార్టీ కార్యకర్తలు కొందరు తమవంతు ఆర్థికసహాయాన్ని అందిచడం జరిగింది. వారితో పాటుగా మండల నాయకులు మరియు గ్రామ నాయకులు కూడా తమవంతు సహాయాన్ని కలిపి 20000 రూపాయలను వారియొక్క తల్లితండ్రులకు జనసేన నాయకుల చేతుల మీదుగా సహాయాన్ని అందించారు. ఈ కార్యక్రమనికి ఆర్థిక సహాయాన్ని సమకూర్చడంలో దుబాయ్ లో ఉండి కష్టపడ్డా ఎల్లమెల్లి బుజ్జికి అందరు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మామిడికుదురు మండల అధ్యక్షులు జలేం శ్రీనివాస రాజా, మండల సర్పంచ్ సమైక్య అధ్యక్షులు అడబాల తాతకాపు, ఎంపీటీసీ కొమ్ముల జంగమ్మయ్య, గ్రామ శేఖ గిడుగు బంగారం, జనసేన నాయకులు కొమ్ముల కొండలరావు, కంకిపాటి నరసింహారావు, పోతు కాశీ, తుండూరి బుజ్జి, మండల కమిటీ సభ్యులు కొమ్ముల భద్రం, అడబాల చిన్ని, ఇంజె రవి, తులా ఉమా, రవనం సాయి, సర్కిల్ అబ్బాస్, కొమ్ముల రాము, శిరిగినీడి శ్రీరాములు, జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు.