బెలుగుప్ప మండలాన్ని కరువు మండలంగా ప్రకటించండి – కాశంశెట్టి సుధీర్

ఉరవకొండ, బెలుగుప్ప మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని జనసేన పార్టీ బెలుగుప్ప మండల అధ్యక్షులు కాశంశెట్టి సుధీర్ సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో జరిగే స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ కేతన్ కార్గ్ కి వినతి పత్రం అందజేశారు. బెలుగుప్ప మండలంలో వర్షాలు రాకపోవడం వల్ల పంటలు చేతికి రాక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదురుకుంటున్నారని ఈ సీజన్లో విత్తనం వేసినటువంటి వేరుశనగ, కంది, ఆముదం, మిరప వంటి పలు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని, చిన్న, సన్నకారు రైతులకు పంటలు నష్టాలు రావడంతో వారి జీవనోపాధి అయిన వ్యవసాయాన్ని వదిలేసి పక్క రాష్ట్రాలకు వలస పోయి దొరికిన పని చేసుకుంటున్నారని, రైతులు వేసిన పంటలకు దిగుబడి రాకపోవడం మరియు నష్టాలు రావడంతో రైతులు కొత్త పంటలు వేయాలంటే భయపడటం జరుగుతున్నదని, ఈ కరువు వల్ల సాగుభూములు కూడా బీడు భూములుగా మారుతున్నాయని కావున బెలుగుప్ప మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి, రైతులకు వచ్చిన నష్టానికి నష్ట పరిహారం ఇప్పించే విధంగా ప్రభుత్వ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లి రైతులకు తగిన న్యాయం చేయాలని వినతిపత్రంలో పేర్కొన్నట్టు జనసేన పార్టీ మండల అధ్యక్షులు కాసంశెట్టి సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయి, చందు పాల్గొన్నారు.