ముమ్మారెడ్డికి అభినందనలు తెలిపిన తుమ్మల మోహన్

తెలంగాణాలో బిజెపి-జనసేన పార్టీ పొత్తులలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించటం జరిగినది. ఈ సందర్భంగా కూకట్పల్లి కో-ఆర్డినేటర్ తుమ్మల మోహన్ కుమార్ మాట్లాడుతూ మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ సమక్షంలో కూకట్పల్లి నియోజకవర్గానికి చెందిన ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ జనసేన పార్టీలో చేరడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా వారికి అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. వారు గతంలో స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా మంచి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, లయన్స్ క్లబ్ ద్వారా కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలను పొందారని అన్నారు. జనసైనికులు అందరూ కూడా ఐక్యమత్యంతో నియోజకవర్గ ప్రజలను చైతన్యపరచి జనసేన పార్టీకి ఓటు వేయించి వారి గెలుపునకు కృషి చేస్తామని అన్నారు.