ఓటరు నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన జనసేన నాయకులు తుమ్మల బాబు

సామర్లకోట రూరల్, పెద్దాపురం నియోజవర్గం సామర్లకోట మండలం నవర గ్రామంలో జనసేన పార్టీ నాయకులు ఓటర్ల నమోదు కార్యక్రమం శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ తుమ్మల రామస్వామి (బాబు) పాల్గొన్నారు. అలాగే ఎన్నికల సంఘం విడుదల చేసినటువంటి 17 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఓటునమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా జనసేన నాయకులు తెలియజేశారు, తుమ్మల రామస్వామి (బాబు) మాట్లాడుతూ రాష్ట్రంలో యువత ఓటు బ్యాంకు అంతా కూడా జనసేన దే అని కాబట్టి అధికార పార్టీ ఎన్నో ఇబ్బందులు పెడుతుందని ముందుగా ఓటు నమోదు చేయించుకుని వచ్చే ఎలక్షన్లో ఓటర్ లిస్టులో తమ పేరు వచ్చేటట్లుగా ముందుగా రిజిస్టర్ చేయించుకోవాలని తుమ్మల రామస్వామి బాబు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సామర్లకోట మండల అధ్యక్షుడు పబ్బినీడి ఈశ్వరరావు, మండల ఉపాధ్యక్షుడు సత్యలింగం, మండల యూత్ అధ్యక్షుడు బుచ్ఛిరాజు, మండల కార్యదర్శి పిల్లి శ్రీను, జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.