జగన్ కు ఓటమి తప్పదు..

  • జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య

రాజంపేట: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం నాలుగేళ్ల పాలనలో సీఎం జగన్ అన్ని రంగాలను నిర్వీర్యం చేశారని, రానున్న ఎన్నికల్లో ఆపార్టీ ఓటమి తప్పదని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని ఉప్పరపల్లె గ్రామంలో ఆయన మాట్లాడుతూ.. వైసిపి అరాచకాలు తిరోగమన పాలనతో ప్రజలు విసుగెత్తారని అందుకే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడిపించే సత్తా గల జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వెంట ప్రజలు నడుస్తున్నారన్నారు. దీన్ని చూసి ఓర్వ లేకే సీఎం జగన్ విమర్శలు చేస్తున్నారన్నారు. పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న జగన్ తన పతనానికి తానే బాటలు వేసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన వీరమహిళలు పాల్గొన్నారు.