శ్రీమతి టి.జి.గీతాంజలి ఆత్మకు శాంతి చేకూరాలి

ప్రముఖ సినీ నిర్మాత శ్రీ టి.జి.విశ్వ ప్రసాద్ గారి మాతృమూర్తి శ్రీమతి గీతాంజలి గారు శివైక్యం చెందారని తెలిసి చింతించానని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. గీతాంజలి గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను. శ్రీ విశ్వ ప్రసాద్ గారికి, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని జనసేనాని పేర్కొన్నారు.