రైతుల రిలే నిరాహార దీక్షకు మద్దతుగా దెందులూరు జనసేన

దెందులూరు నియోజకవర్గం, కొవ్వలి గ్రామంలో రైతులకు ధాన్యం బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరుతూ రైతులు చేపట్టిన రిలే నిరాహార దీక్షకు మద్దతుగా దెందులూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున మంగళవారం నియోజకవర్గ నాయకులు కొఠారు ఆదిశేషు సంఘీభావం తెలపడం జరిగింది. ఆయన మాట్లాడుతూ ఒక్క కొవ్వలి గ్రామంలోనే 19 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించవలసి ఉండగా, 8 కోట్లు మాత్రమే చెల్లించారు 2 నెలలు దాటినా ఎటువంటి కదలిక లేపోవడంతో రైతన్నలు రిలే దీక్షలు చేపట్టారని అన్నారు. దెందులూరు జనసేన పార్టీ నుండి రైతుల తరుపున పోరాటం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దెందులూరు నియోజకవర్గ ఐ.టి విభాగ కో ఆర్డినేటర్ ఏనుగు రామకృష్ణ, నియోజకవర్గ నాయకులు రాంకీ, పూజారి సీతారాం, ఇంటూరి కృష్ణ, నేతి రామకృష్ణ పాల్గొన్నారు.