సింగరేణిలో 372 పోస్టులకు రాత పరీక్షలు తేదీల వివరాలు..
సింగరేణి సంస్థలో 372 ట్రైనీ కొలువుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ముగిసిన విషయం తెలిసిందే. తాజాగా పరీక్ష తేదీలు వచ్చేశాయి. ఈ పోస్టులకు ఫిబ్రవరి 21 నుంచి రాతపరీక్షలు జరగనున్నాయి. మొత్తం 372 పోస్టులకు ఏడు కేటగిరీల్లో 24,958 మంది క్యాండిడేట్లు పోటీ పడనున్నారు. రెండు రకాల పోస్టులకు మినహా మిగిలిన వాటి ఎగ్జామ్ షెడ్యూల్ను సింగరేణి సంస్థ డైరెక్టర్ ఎస్.చంద్రశేఖర్ అనౌన్స్ చేశారు.
ఎగ్జామ్ డేట్స్:
టర్నర్, మెషినిస్ట్ పోస్టులకు – ఫిబ్రవరి 21
మోటారు మెకానిక్ పోస్టులకు – ఫిబ్రవరి 24
వెల్డర్ పోస్టులకు – ఫిబ్రవరి 28
ఫౌండ్రీమెన్/మౌల్డర్ పోస్టులకు – మార్చి 3
జూనియర్ స్టాఫ్ నర్స్ పోస్టులకు- మార్చి 7
ఫిట్టర్ పోస్టులకు- మార్చిలో
ఎలక్ట్రీషియన్ పోస్టులకు – మార్చిలో