ప్రభుత్వ వైఖరి వల్లే విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య: పవన్

ప్రభుత్వ వైఖరి వల్లే ఇంజినీరింగ్ విద్యార్థిని తేజస్విని ఆత్మహత్య చేసుకున్నట్లు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. కాలేజీలకు ఫీజు రీ ఎంబర్స్మెంట్‌లో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరే కారణమని చెప్పారు. ఫీజు బకాయిలు రాలేదు కాబట్టి పరీక్షలకు అనుమతించమని కళాశాలల యాజమాన్యాలు తేల్చి చెబుతుంటే..పేద విద్యార్థులు, వారి తల్లితండ్రులు తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఫీజు రీ ఎంబర్స్మెంట్ విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పేద విద్యార్థుల ఫీజుల బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. తేజస్విని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.