క్రియాశీల సభ్యత్వ నమోదు అవగాహనా కార్యక్రమం చేపట్టిన దేవా గౌడ్ ప్రసాద్

కొత్తగూడెం నియోజకవర్గం, పాల్వంచ మండలంలో జనసేన క్రియాశీలక సభ్యత్వాల నమోదుపై ప్రజలలో అవగాహన పెంచేందుకై జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా.. జనసైనికుడు దేవా గౌడ్ ప్రసాద్ తమ వంతు ప్రయత్నంగా మండలంలో బైక్ పై తిరుగుతూ.. క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం కలిగే ప్రయోజనాలను ప్రజలకు తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ మిగిలిన మండలాలలో కూడా జనసైనికులు ఈ విధంగా ప్రయత్నం చేయాలిసిందిగా మనవి చేసారు.. పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు మరియు సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తూ.. క్రియాశీలక సభ్యత్వం తీసుకోవడం కలిగే ప్రయోజనాలను వివరించడం జరిగింది.. ప్రతి అభిమాని సభ్యత్వం తీసుకోవాల్సిందిగా తెలియజేసారు.