త్వరలో దేవాంగ గర్జన సభ

ఆంధ్రప్రదేశ్ దేవాంగ రాష్ట్ర సంక్షేమ సంఘం విజయవాడ దేవాంగ భవనంలో కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం రాజకీయాల్లో కూడా దేవాంగులు బలపడాలని రాజకీయాల్లో తగిన స్థానం దేవాంగుల కులానికి సీట్లు కేటాయించాలని ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది మా దేవాంగులు రాష్ట్రంలో చీరాల, రాజమండ్రి, పెడన, హిందూపురం, ధర్మవరం నియోజకవర్గంలో దేవాంగుల బలం అధికంగా ఉండడం వల్ల ఆ నియోజకవర్గంలో రాజకీయ పార్టీలు స్థానం కల్పించాల్సిందిగా సమావేశం ఏర్పాటు చేసి త్వరలో దేవంగ గర్జన మహాసభ కోసం కార్యవర్గ ఏర్పాటు చేయుచున్నారు. ఆంధ్రప్రదేశ్ దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షులు నాగరాజు, పుచ్చల రామకృష్ణ, బీరక ప్రసాద్, సజ్జల హేమలత, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు నక్కిని విజయలక్ష్మి, జాతీయ చేనేత ఐక్యవేదిక సంఘం న్యాయవిభగ రాష్ట్ర అధ్యక్షులు, న్యాయవాది మరియు జనసేన నాయకులు ములకల హనుమాన్ తదుపరి దేవాంగ సంఘ నాయకులు పాల్గొన్నారు.