కోరుమిల్లి అభివృద్ధి జనసేనతోనే సాధ్యం: పల్లెపోరులో బొలిశెట్టి

  • ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జనసేనతోనే సాధ్యం జనసేన పల్లెపోలులో బొలిశెట్టి శ్రీనివాస్

తాడేపల్లిగూడెం నియోజకవర్గం: వైసీపీ అధికారాన్ని గద్దె దించే రోజు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురుచూస్తున్నారని బొలిశెట్టి అన్నారు. పెంటపాడు మండలం కోరుమిల్లి గ్రామంలో శుక్రవారం జరిగిన పల్లెపోరు కార్యక్రమంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అరాచక పాలన జరుగుతుందని గ్రామంలో రోడ్ల పరిస్థితి చూస్తే మనిషి నడవడానికి కూడా లేకుండా చాలా అధ్వానంగా ఉన్నాయన్నారు, కోరుమిల్లీ గ్రామంలో స్థానికులయిన జనసైనికులు ఇక్కడ ప్రజలకు సేవ చేయడం గురించి తెలుసుకొని మీకన్నా ముందు నేను ఉంటా అని మీరు చేసే కార్యక్రమాల సేవలకు నా వంతుగా నేను సాయం చేస్తా అని శ్రీనివాస్ అన్నారు. ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కరువయ్యాయన్నారు. కోరుమిల్లి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థపై అస్తవ్యస్తంగా ఉందన్నారు. జనసేన కర్రపత్రాలు స్థానికులకు ఇస్తు జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక చేసే పనులు గురించి కోరుమిల్లి గ్రామ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పెంటపాడు మండల అధ్యక్షులు పుల్లా బాబి, స్థానిక నాయకులు జేనుల సురేంద్ర, మోతూరి వర్రప్రసాద్, పెనుమాక రామస్వామి, చుందూరి కేశవరావు, కట్టుంగా రవితేజ, పందెం మురళి, మోటూరి నాని, చిలక బద్రి, చిలక శ్రీను, అధికార ప్రతినిధి సజ్జ సుబ్బు, జిల్లా ప్రధాన కార్యదర్శి యంట్రపాటి రాజు, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షులు అడపాప్రసాద్, జనసేన నాయకులు గుండుమోగుల సురేష్, నల్లగంచు రాంబాబు, మట్టా రామకృష్ణ, మాదాసు ఇందు, అడ్డగర్ల సురేష్, అడబాల మురళి, చాపల రమేష్, జగత్ సోమశేఖర్, పిడుగు మోహన్ బ్రదర్స్, పాలూరి బూరయ్యా, నీలపాల దినేష్, ఏపూరి సాయి, సోషల్ మీడియా ఇంచార్జ్ బయనపాలేపు ముఖేష్, భార్గవ్, దంగేటి చందు, బత్తిరెడ్డి రత్తయ్య, వానపల్లి సాయిరాం, మేది శెట్టి మాణిక్యాలరావు, గట్టిం నాని, ములగాల శివ, కాజురూరి మల్లేశ్వరరావు, మట్టా రాంబాబు, ప్రసాద్, ద్వారబంధం సురేషు, నరాల శెట్టి జాన్, శెట్టి ప్రసాద్ సంతోష్, ఎస్ కె వల్లి, యవర్న సోమా శంకర్, మద్దాల నరసింహ, కవల ధర్మేంద్ర, మరిపూడి చిన్న వీరమహిళలు పెంటపాడు మండల మహిళా అధ్యక్షురాలు పెనుబోతుల సోమలమ్మ, తాడేపల్లిగూడెం మండల అధ్యక్షురాలు వెజ్జు రత్నకుమారి, అడపా జమున, మధు శ్రీ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.