జన చైతన్య శంఖారావంలో కందుల దుర్గేష్ పాట ఆవిష్కరణ

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల జనసేన పార్టీ అధ్యక్షులు కందులు దుర్గేష్ రాజమండ్రి రూరల్ వ్యాప్తంగా జనసేన పార్టీని మరింత బలోపేతానికై చేపట్టిన జన చైతన్య శంఖారావం 2వ రోజు కార్యక్రమంలో భాగంగా కొలమూరు గ్రామంలో జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ ను పిఠాపురం నియోజకవర్గ జనసైనికుడు గంజి గోవిందరాజు కలిసి ఆయనకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గోవిందరాజు అభిమానంతో దుర్గేష్ పై రాసిన పాటను ఆవిష్కరించడం జరిగింది. రాజమండ్రి నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి తోలేటి శిరీష, పిఠాపురం నియోజకవర్గ నాయకులు ఊట ఆది విష్ణు (నానిబాబు), కందరాడ ఎంపీటీసీ పిల్లా సునీతసూర్యనారాయణ ( దినేష్), వాకపల్లి సూర్యప్రకాష్, తాటికాయల ప్రసాద్, తమ్మనబోయిన సుదర్శన్, కొండపల్లి శివయ్య, పాటి రాంబాబు, సీకోలు రాజశేఖర్ తదితర పిఠాపురం జనసేన నాయకులు పాల్గొనడం జరిగింది.