చర్లగుడిపాడు గ్రామంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

గురజాల నియోజకవర్గం: చర్లగుడిపాడు గ్రామంలో ఆదివారం జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన జనసేన కిట్లను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా జనసేన కార్యదర్శి కొమ్ము యాకోబు, పేరు పోగు కోటేశ్వరరావు, బక్క మారే బాబు, బందెల రవికుమార్ ల ఆధ్వర్యంలో క్రియాశీల సభ్యత్వం కార్డు పంపిణీ జరిగినది.