తుమ్మల మోహన్ కుమార్ కు చిరు సత్కారం

కేపీహెచ్ బీ: కేపీహెచ్ బీ కాలనీ 3వ ఫేస్ రమ్య గ్రౌండ్స్ నందు శ్రీ శివశక్తి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 34 సంవత్సరాలుగా గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ గణేష్ ఉత్సవాలలో సందర్భముగా దాతలను సన్మానించుకునే సంప్రదాయంలో భాగంగా మంగళవారం జనసేన పార్టీ కోఆర్డినేటర్ తుమ్మల మోహన్ కుమార్ కు శాలువా మెమొంటో ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో కట్టా నర్సింగరావు, వాసిరెడ్డి లక్ష్మీనారాయణ, నారాయణ రావు, కొల్లా శంకర్, రామకృష్ణ, రాజా, సాంబశివరావు, కుమార్ రెడ్డి మరియు శివశక్తి కల్చర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.