పాతతుంగపాడు గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజానగరం నియోజకవర్గం: జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జనసేన కుటుంబసభ్యుల భద్రత కోసం చేపట్టిన క్రియాశీలక సభ్యత్వాల కిట్లు పంపిణీ కార్యక్రమం రాజానగరం మండలం, పాత తుంగపాడు గ్రామంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా క్రియాశీలక సభ్యత్వ కిట్లను రాజానగరం జనసేన ఇంచార్జ్ బత్తుల బలరామకృష్ణ, శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో పాత తుంగపాడు జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.