పలాస నియోజకవర్గంలో క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

పలాస నియోజకవర్గం: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల ప్రకారం జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు పలాస నియోజకవర్గంలో ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన జనసేన కిట్లను అందజేశారు. కార్యక్రమంలో భాగంగా హరీష్ కుమార్ మరియు కృష్ణా రావు సభ్యత్వాలు చేయించిన సభ్యులకు క్రియాశీల కిట్లను హరీష్ పర్యవేక్షణలో పలాస నియోజకవర్గ సీనియర్ జనసైనికుడు కృష్ణా రావు పలాస 23వ వార్డులో వారి ఇంటింటికీ అందజేసారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు దీనబందు పాత్రో, పట్టి ఉదయ్ కిరణ్, గిరీష్, హేమ కుమార్, లవ కుమార్, దశరథ, ధనరాజ్ పాల్గొన్నారు.