తాడిపత్రిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తాడిపత్రి నియోజకవర్గం: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ జనసేన ఇన్చార్జ్ కదిరి శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్లను అందించే కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తలను దృష్టిలో ఉంచుకొని ప్రమాదబారిన పడిన జనసైనికుల కుటుంబాలకు భద్రత కల్పించాలని క్రియాశీలక సభ్యత్వాన్ని అమలులోనికి తెచ్చారు. అందులో భాగంగా తాడిపత్ర నియోజకవర్గానికి సంబంధించి క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ కిట్లను అందజేయడం జరిగింది. ఇన్సూరెన్స్ కిట్లలో జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు, సభ్యుడి ఐడి కార్డు మరియు పవన్ ఫోటోతో ఉన్న బ్యాగులను అందించారు. దాదాపు నియోజకవర్గ వ్యాప్తంగా 1200 మంది సభ్యత్వం తీసుకున్నట్లు శ్రీకాంత్ రెడ్డి తెలిపారు. భవిష్యత్తులో అధిక సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి పార్టీ కోసం పని చేసే వారికి బీమా సదుపాయం కల్పించి భరోసా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపత్రి పట్టణ అధ్యక్షులు నరసింహ చారి నియోజకవర్గ నాయకులు కిరణ్ కుమార్, గోపాల్ పట్టణ కార్యదర్శులు మణికంఠ, రసూల్, అయూబ్, కొండాశివ మరియు యాడికి మండల కన్వీనర్ సునీల్ కుమార్, పెద్దవడుగూరు మండల కన్వీనర్ దూద్ వలి ఇతర జనసైనికులు పాల్గొన్నారు.