జనసేన ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ పంపిణీ

ములకలపల్లి మండలంలో నూతన శివాలయ విగ్రహ, ధ్వజస్థంభ ప్రతిష్టకు విచ్చేయు భక్తులకు 8 వేల మంది పైచిలుకు భక్తులకు ములకలపల్లి మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ మండల నాయకులు తాటికొండ ప్రవీణ్, పొడిచేటి చెన్నారావు, చామర్తి సుధాకర్, నక్కన రమేష్, రవి, అలుగుల శ్రావణ్, యుకే నాగరాజ్, యుకే ముత్యాలరావు, దాసి నవీన్, బోలాగని పవన్ కళ్యాణ్, లాక్టోత్ నవీన్, కాక రాజేష్, చిర్ర వీరభద్రం, ముదిగొండ సాగర్, బొక్క వెంకటేశ్వర్లు, ఇమ్మడి రామారావు అన్నపురెడ్డిపల్లి మండల నాయకులు తలారి రాజు, ఉమ్మడి ఖమ్మం జిల్లావిద్యార్థి విభాగం నాయకులు గొల్ల వీరభద్రం, ఉమ్మడి ఖమ్మం జిల్లాయువజన విభాగం సెక్రటరీ గరికె రాంబాబు తదితరులు పాల్గొన్నారు.