క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు చెక్కుల పంపిణీ

• బాధిత కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పిన పవన్ కళ్యాణ్
ఇటీవల ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయిన కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన జనసేన క్రియాశీలక సభ్యుల కుటుంబాలకు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున ప్రమాద బీమా చెక్కులు అందించారు. ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున అందజేశారు. గురువారం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో బాధిత కుటుంబాలను పవన్ కళ్యాణ్ గారు పరామర్శించారు. పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చారు. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన శ్రీమతి చెన్నూరు దుర్గమ్మ, పత్తి నాగ వెంకట రమణ, బొండలపాటి శివనాగేశ్వరరావు, గుర్రాల దివ్యతేజ, శ్రీమతి గుర్రాల జయశ్రీ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వారి కుటుంబాలకు పవన్ కళ్యాణ్ పరిహారం చెక్కులు అందించారు.