కోలాహలంగా యువశక్తి సభాస్థలి

జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనవరి 12వ తేదీన శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగనున్న యువశక్తి సభాస్థలి కోలాహలంగా మారింది. పార్టీ నేతలు, వీర మహిళలు, జన సైనికులతో సందడిగా ఉంది. సభకు తరలివచ్చే యువత, పార్టీ శ్రేణుల కోసం ఏర్పాట్లను, భోజన వసతిని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ 

ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పరిశీలించారు. స్వయంగా వంటశాల వద్దకు వెళ్లి మెనూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు, సభా ప్రాంగణానికి తుది మెరుగులు అద్దుతున్న కార్మికులతో కలిసి భోజనం చేశారు. లక్షలాది మందిగా తరలివచ్చే యువతకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆహారం, తాగునీరు అందే విధంగా చూడాలని నిర్వాహకులకు సూచించారు.
విరాళాలతో చేయూత
యువ శక్తి కార్యక్రమ నిర్వహణకు జనసేన పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు రూ.10 లక్షలు, విజయనగరం జిల్లా నాయకుడు శ్రీ మర్రాపు సురేష్ రూ.5 లక్షలు విరాళం అందచేశారు.