నరవ గ్రామంలో జనసేన ఆధ్వర్యంలో మట్టి గణపతి ప్రతిముల పంపిణీ

పెందుర్తి నియోజకవర్గం, 88 వార్డ్, నరవ గ్రామం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతం పర్యావరణ పరిరక్షణలో భాగంగా నరవ గ్రామం, 88 వార్డ్, పెందుర్తి నియోజకవర్గంలో స్థానిక నాయకులు గళ్ళ శ్రీనివాసరావు ఆర్థిక సహాయంతో వబ్బిన జనార్ధన శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఎస్సి, బిసి ప్రభుత్వ పాఠశాల, ఎంపిపి ప్రభుత్వ పాఠశాల, అంగన్వాడి స్కూల్లో విద్యార్థులకు మట్టి గణపతి ప్రతిముల పంపిణీ చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో గళ్ళ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యార్థులందరూ మట్టి గణపతిని పూజించి చదువులో ఉన్నత ప్రతిభ కనబరచాలని కోరుకోవాలని, విద్యార్థులందరికీ అష్టైశ్వర్యాలు, మంచి ఆరోగ్యం ఇవ్వాలని కోరడం జరిగింది. శ్రీకాంత్ మాట్లాడుతూ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు అనుగుణంగా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మంగళవార, విద్యార్థులందరికీ మట్టి గణపతి ప్రతిమలు ఇవ్వడం జరిగిందని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని మాత్రమే పూజించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు బొడ్డు నాయుడు, రవి బాబు, రాది తేజ, పింటు, ప్రసాద్, జనసైనికులు పాల్గొన్నారు.