మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన పార్వతీపురం జనసేన

పార్వతీపురం, మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన జనసేన పార్టీ నాయకులు పార్వతీపురం పట్టణ పాత బస్టాండ్ లో మంగళవారం పార్వతీపురం మన్యం జిల్లా జనసేన పార్టీ నాయకులు మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ జిల్లా నాయకులు చందక అనిల్ కుమార్, గొర్లి చంటి, రెడ్డి కరుణ, వంగల దాలినాయుడు, బంటు శిరీస్, రాజాన రాంబాబు, నెయ్యగాపుల సురేష్, గంగిరెడ్ల జగదీష్, మండల శరత్, నర్శిపురం మణి, వంగలపూడి నాని, మానేపల్లి ప్రవీణ్, వీరమహిళ గోవిందమ్మ, సిరిపురపు గౌరీ శంకర్ తదితరులు మాట్లాడుతూ జనసేనాని కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వారోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటికే రక్తదానం, వస్త్రదానం చేయడం జరిగిందని వినాయక చవితి సందర్భంగా మట్టి వినాయక్ విగ్రహాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. పర్యావరణ పరిరక్షణకై ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజలకు మట్టి విగ్రహాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సాయి, తిరుమలరెడ్డి వంశీ, బూర్ల కిరణ్, తదితర జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.