పండుగలా జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

*చిట్వేలి జనసేన పార్టీ ఆధ్వర్యంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది.

చిట్వేలి: జనసేనాని పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు.. మాదాసు నరసింహ కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ ఆధ్వర్యంలో.. పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు చేసిన క్రియాశీలక సభ్యులకు కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ముఖ్య అతిథులుగా హాజరైన రాష్ట్ర కార్యదర్శులు వడ్రాణం మార్కండేయా బాబు, తాతంశెట్టి నాగేంద్ర, మరియు ఇంచార్జి బోనాసి వెంకట సుబ్బయ్య విచ్చేసి విజయవంతం చేయడం జరిగింది. వారు మాట్లాడుతూ.. పార్టీ బలోపేతం కోసం కృషి చేయాలని.. పార్టీ సిద్ధాంతాలు నిస్వార్ధంగా కష్టపడే జనసైనికులు అందరిని గుర్తించేలా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం.. ఆలోచన ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేలా కృషి చేయాలని.. అందరికీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కోడూరు జనసేన నాయకులు పగడాల వెంకటేష్, వరికూటి నాగరాజా, ఎద్దుల అనంత రాయల్, ముత్యాల కిషోర్, మరి రెడ్డి ప్రసాద్, వీర మహిళ సింగిరి శివమ్మ, ఆలం రమేష్, వై కోట టీమ్ సభ్యులు సాయం సాగర్ రెడ్డి, మనీ, నల్ల శెట్టి కిషోర్, మాదాసు నరసింహులు, మాదాసు శివ, కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ శంకర్, షేక్ రియాజ్, పెంచలయ్య, కడుమురి నాగరాజు, కొనిశెట్టి ప్రసాద్, మురళి కృష్ణ, ఆనందల తేజ,షేక్ సోను, పగడాల భరత్ షేక్ మస్తాన్, సుసు వారపు హరి, సునీల్, పసల శివ, బెడుదురి పెంచలయ్య, పగడాల శివరామ్, పెద్దంగారి వంశీ తదితరులు పాల్గొన్నారు. నిస్వార్ధమైన జనసైనికులు, పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.