పేదలకు భోజన పొట్లాల వితరణ

అమలాపురం: శుభకార్యాలలో మిగిలిన భోజనాలు పేదవారికి పంచే కార్యక్రమంలో భాగంగా ఆదివారం అమలాపురం రూరల్ మండలంలోని ఒక గ్రామంలో జరిగిన వివాహ వేడుకల్లో భోజనాలు పూర్తయిన తర్వాత ఆహారం మిగిలిందని వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్పారు. మిగిలిన భోజనాలను ఉన్నాయని మోటూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేయగా. వెంటనే వారు అక్కడికి వెళ్లి వారి సమక్షంలో భోజనాలు ప్యాకింగ్ చేసి ట్రక్ ఆటో లో 550 మందికి అమలాపురం పట్టణంలో వృద్ధులకు, వికలాంగులకు, బిచ్చగాళ్లకు, అనాధలకు పంచి పెట్టడం జరిగింది. అలాగే మామిడికుదురు మండలం మాకన్నపాలెం ఒక కార్యక్రమంలో భోజనాలు పూర్తయిన తర్వాత మిగిలిన ఆహార పదార్థాలు ఉన్నాయని వారు కూడా ఫోన్ చేసి చేయగా వెంటనే అక్కడికి వెళ్లి ట్రక్ ఆటోలో 250 మందికి భోజనాలు పంచిపెట్టడం జరిగింది. ఆదివారం మొత్తం 800 మందికి భోజన పొట్లాలను పంచిపెట్టడం జరిగింది.