పేదలకు భోజన పొట్లాల వితరణ

అమలాపురం: శుభకార్యాలలో మిగిలిన భోజనాలు పేదవారికి పంచే కార్యక్రమంలో భాగంగా గురువారం మామిడికుదురు మండలం, పాసర్లపూడి గ్రామంలో చింతల మెరక చెందిన కాండ్రేకుల వారి వివాహ వేడుకల్లో భోజనాల కార్యక్రమం అనంతరం మిగిలిన భోజనాలను ఉన్నాయని మోటూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేయగా. వెంటనే వారు అక్కడికి వెళ్లి వారి సమక్షంలో భోజనాలు ప్యాకింగ్ చేసి 200 మందికి, మరియు అంబాజీపేట మండలం ముంగండ చివర కామిరెడ్డి వివాహ వేడుకల్లో మిగిలిన ఆహారాన్ని ప్యాకింగ్ చేసి 50 మందికి అమలాపురం పట్టణంలో సాధువులకు, అనాధలకు, వృద్ధులకు, పేదవాళ్లకు గురువారం మొత్తం 250 మందికి భోజన పోట్లాలు పంచి పెట్టడం జరిగింది.