శ్రీరామ నవమి సందర్భంగా జనసేన ఆధ్వర్యంలో మంచినీటి పంపిణీ

నాగర్ కర్నూల్, గురువారం శ్రీరామ నవమి సందర్భంగా నాగర్ కర్నూల్ నియోజకవర్గం, తెల్కపల్లి మండలం, కారువంగా గ్రామంలో ఆలయ సన్నిధిలో గోపాస్ కుర్మన్న, గోపాస్ రమేష్ ల గ్రామ జనసైనికుల ఆధ్వర్యంలో మంచి నీటి పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు వంగ లక్ష్మణ్ గౌడ్ హాజరై ఆలయంలో సీతరాముల దర్శనం చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ గౌడ్ మాట్లాడుతూ సీతారాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించాలని విచ్చేసే భక్తులకు చల్లని మంచి నీటి పంపిణీ చేయాలనే ఆలోచన విధానంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ప్రజలందరిపై సీతరాముల చల్లని ఆశీస్సులు ఉండాలని, కోరుకుంటూ ప్రజలందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంగ విజయ్ భాస్కర్ గౌడ్, కొడిగంటీ సాయి కుమార్, సూర్య, వంశీ రెడ్డి, రాజు నాయక్, పూస శివ, బాబా తదితరులు పాల్గొన్నారు.