రెండు గంటల్లో బోరు బాగు చేయించిన జనసేన కార్పొరేటర్ శ్రీ గోవింద్ రెడ్డి

సమస్య దృష్టికి రావడమే ఆలస్యం….తక్షణం స్పందించడం ఆయన గుణం….బాధ్యత తీసుకొని పరిష్కరించడం ఆయన నైజం. విశాఖ నగర పాలక సంస్థ 64వ వార్డు కార్పొరేటర్ గా జనసేన పార్టీ తరఫున ఎన్నికైన శ్రీ దల్లి గోవింద్ రెడ్డి నిత్యం ప్రజా సేవలో లీనమై ఉంటారు. తాజాగా గంగవరం గ్రామం దార వీధి వారు మంచినీటి బోరు చెడిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు. ఎవరికి చెప్పినా సమస్య పరిష్కారం కాలేదు. చివరకు కార్పొరేటర్ ని కలిశారు. వెంటనే శ్రీ గోవింద్ రెడ్డ జీవీఎంసీ వారితో మాట్లాడారు. బోరుకు కావాల్సిన కొత్త పైపులు, సామాగ్రి తెప్పించారు. రెండు గంటల్లో బోరు బాగు చేయించి తాగునీటి కష్టం తొలగించారు. అక్కడి ప్రజల మన్ననలు పొందారు. జాలారి పల్లిపాలెంలో వీధిదీపాలు వెలగడం లేదనే విషయం తెలిసిన వెంటనే అక్కడకు వెళ్లి రిపేర్లు మొదలు పెట్టించారు. ఆయన వెంట జనసేన నాయకులు సి.హెచ్. ముసలయ్య, వై.నూకరాజు, మెగా నూకరాజు, జానీ, సింగపూర్, దానయ్య, రాజు, గణేశ్, కోదండరావు తదితరులు ఉన్నారు.