జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా దివ్యాంగుల ఆశ్రమం నందు పండ్లు పంపిణీ

వరంగల్, పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 8 వసంతాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభసందర్బంగా వరంగల్ నగరంలోని 11వ డివిజన్ నాయకులు పిడుగు భరత్ యాదవ్ ఆధ్వర్యంలో అతిధి దివ్యాంగుల ఆశ్రమం నందు పండ్లు పంపిణీచేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసైనికులు ప్రశాంత్ యాదవ్, సాయి యాదవ్, రాజు, కరణ్, పులి రామ్ తదితరులు.