ఇప్పటం సభ విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపిన బండారు శ్రీనివాస్

తూర్పుగోదావరి జిల్లా, కొత్తపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్చార్జ్, బండారు శ్రీనివాస్ మాట్లాడుతూ, చలో అమరావతి నినాదంపై నిన్న ఇప్పటం గ్రామంలో జరిగిన భారీ బహిరంగ సభకు జనసేనానికి మద్దతు, కొత్తపేట నియోజక వర్గం నాలుగు మండలాల నుంచి, మరియు నియోజకవర్గం నలుమూలల ప్రతి గ్రామం నుంచి తరలి వచ్చిన, సభను దిగ్విజయంగా విజయవంతం చేసి, జనసేనాని మాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క కార్యకర్తకు, వీర మహిళలకు, జనసైనికులకు, జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులకు నా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని బండారు శ్రీనివాస్ అన్నారు. అంతేకాకుండా తూర్పుగోదావరి జిల్లా రథసారథి కందుల దుర్గేష్ నాయకత్వం సమర్థిస్తూ, బలం చేకూర్చి సభను జయప్రదం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి భారీ స్థాయిలో వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తకు ధన్యవాదాలు అని, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో, ఆంధ్ర,తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన జన సైనికులకు కార్యకర్తలకు అభిమానులకు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. 13 జిల్లాల ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, మహిళాలకు, యువతకు రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథం వైపు, అవినీతి లేని రామ రాజ్యం వైపు నడిపించాలంటే ఒక జనసేనాని కి మాత్రమే సాధ్యమవుతుందని, ఇలాంటి గొప్ప నాయకుల్ని రాబోయే రోజుల్లో అధికారం ఇచ్చి గెలిపించి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నదని ఈ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు.