తెలంగాణ జనసేన ఆద్వర్యంలో గంగాజలం పంపిణీ

జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆశయాల సాధనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ఇన్ ఛార్జ్ ఎన్. శంకర్ గౌడ్ మరియు గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు ఆర్. రాజలింగం ఆదేశాల మేరకు చర్లపల్లి డివిజన్ అధ్యక్షులు కే. శివ కార్తీక్ ఆధ్వర్యంలో చర్లపల్లి డివిజన్ ఈ.సీ నగర్ లో గల గణపతి దేవాలయంలో కొలువున్న భవాని శంకర్ ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా విచ్చేసిన భక్తులకు చర్లపల్లి డివిజన్ జనసేన పార్టీ నాయకులు ఉచిత గంగాజలాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర వీరమహిళా వైస్ చైర్మన్ రత్న, గ్రేటర్ హైదరాబాద్ వైస్ ప్రెసిడెంట్ వెంకటాచారి, డా. స్వామీ నాయుడు, సుజాత, ఆకుల లక్ష్మి, ప్రవీణ్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.