రెడ్డిగూడెం మండల జనసేన కార్యాలయంలో మెగా ఉచిత కంటి వైద్య శిబిరం

మైలవరం, రెడ్డిగూడెం మండల జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ వాసన్ ఐ కేర్ వారు ఉచిత మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో 196 మంది కంటి సమస్యలు ఉన్న వారు వచ్చి పరీక్షలు చేయించుకోవడం జరిగింది. ఆపరేషన్ అవసరం ఉన్నవారిని విజయవాడ వాసన్ ఐ కేర్ కి సిఫార్సు చేసి ఉచితంగా ఆపరేషన్ చేస్తామని హాస్పిటల్ సిబ్బంది తెలిపారు. పరీక్షలు చేయించుకున్న వారికి ఉచితంగా మందులు మరియు ఐ డ్రాప్స్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఇన్చార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) పాల్గొని పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డిగూడెం మండల అధ్యక్షులు చాపలమడుగు కాంతారావు నాయకులు పాములపాటి సుందరరామిరెడ్డి, తోట క్రాంతిబాబు, కొండపల్లి మణికంఠ, రామకృష్ణ, సుభాని, పడిశాల రమేష్, రమేష్ బాబు, వేణు, సాయిదుర్గారావు, సాయినాథ్ ఇంకా జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.