జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు.. జగనన్న మోసం, డిజిటల్ ప్రచారం నిర్వహించిన నెల్లూరు జనసేన

నెల్లూరు జిల్లా: జగనన్న ఇల్లు – పేదలందరికీ కన్నీళ్లు, జగనన్న మోసం హాష్ టాగ్ 12 వ తేదీన కార్యక్రమంలో బాగంగా #జగనన్న మోసం అనే హాష్ టాగ్ లైన్ తో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశం మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ ఆమోదంతో అనంత సాగరం మండలం పాత దేవరాయ పల్లి పంచాయితీ పరిధిలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ పర్యటించడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన్ మాట్లాడుతూ.. బాగంగా జగన్ రెడ్డి నవరత్నాల్లో కీలక అంశం అయిన పేదలందరికీ సొంత ఇల్లు అందిస్తాను అని వాగ్దానం చేసారు ముఖ్యమంత్రి. రాష్ట్రములో 68 వేల ఎకరాలో 28 లక్షలు ఇల్లు ఇస్తాం అన్న మాట ఏమి అయింది అని ఎద్దెవా చెసారు. అనంత సాగరం మండలంలో 1030 పై చిలుకు జగనన్న ఇల్లులు ప్రభుత్వం శాంక్షన్ చేయగా 4 వ సంవత్సరాలు నడుస్తున్న ఇప్పటికి ఒక్కఇల్లు కూడా లబ్దిదారులకు పూర్తీగా అందించలేకపోవటం నిజంగా జగన్ రెడ్డి ప్రభుత్వానికే సిగ్గు చేటు అన్నారు. ఈ కార్యక్రమంలో జన సైనికులతో కలిసి సందర్శించి ఇళ్ల లబ్ధి దరుల బాధితులకి అండగా నిలబడతాం అన్ని చెప్పడం జరగింది.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు షేక్ మహా బూబ్ మస్తాన్ తో పాటు మండల సంయుక్త కార్యదర్శి షేక్ ఖాజా మస్తాన్ మరియు అనంతసాగరం మండలం జన సైనికులు, లసాని, షేక్ సుభని, వహీద్, సురేంద్ర రెడ్డి, హకీమ్, షేక్ మహబూబ్ బాషా, షేక్ శుభాని తది తరులు పాల్గొనడం జరిగింది.