రెడ్డయ్య, చంద్రశేఖర్ లను పరామర్శించిన రామ శ్రీనివాస్

రాజంపేట నియోజకవర్గం: టి.సుండుపల్లి మండలం, పొలిమేరపల్లె గ్రామ పంచాయితీపరిధిలో తూర్పు మాలపల్లె గ్రామస్తులు
రెడ్డయ్య, చంద్రశేఖర్ భూమి విషయంలో ఆదివారం ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో వారిరువురూ గాయపడి రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సమాచారం అందుకున్న జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ సోమవారం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డయ్యను, అదే సమయంలో యువకుడు చంద్రశేఖర్ ఇరువురుని పరామర్శించి, అనంతరం పోలీసు అధికారుల ద్వారా విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్.వెంకటయ్య, సోమల కృష్ణంరాజు, రామ్మోహన్ రాజు, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.