చండ్రగూడెంలో ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తిచేయాలి: శీలం బ్రహ్మయ్య

మైలవరం: స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ మైలవరం మండల అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. చండ్రగూడెంలో పేదవాళ్లకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం త్వరితగతిన పూర్తిచేయాలని, గత నాలుగు సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన దగ్గర నుండి ఇండ్ల పట్టాల పంపిణీ పేపర్లకు మాత్రమే పరిమితమైందని, వాస్తవరూపం దాల్చలేదని వాపోయారు. చండ్రగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని 450 మంది లబ్ధిదారులకు ఇండ్ల స్థలాలు మంజూరు చేయవలసి ఉన్నదని, ఇంతవరకు స్థలాల పంపిణీ జరగలేదని, అదేవిధంగా స్మశాన వాటిక నిర్మాణానికి కూడా నిధులు మంజూరు చేసి వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఇటువంటి కార్యక్రమాలు చండ్రగూడెంలో పూర్తి చేయకుండా ఏ రకంగా? స్థానిక ఎమ్మెల్యే గడపగడపకు వస్తారో చూస్తామన్నారు. భూమి కొనుగోలు పూర్తయిందని చెబుతూ వస్తున్న అధికారులు తక్షణమే ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.