జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ఇంటింటికి జనసేన సిద్ధాంతాలు తెలియజేస్తూ వచ్చే ఎలక్షన్లో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవడానికి పోరాడుతాం మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలంలో జనసేన జెండా ఎగరవేయడం ఖాయం అంటున్న జనసేన కార్యకర్తలు మరియు జనసేన వీర మహిళలు. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు దేవా గౌడ్, సాయి కుమార్ గౌడ్, కొండా సాయి, ఎం. ప్రసాద్ గౌడ్ ప్రసాద్, సాయి వంశీ ఈ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ జనసేన పార్టీ మీకు తోడు ఉంటుందని పాల్వంచ జనసేన తరపున తెలియచేయడం జరిగింది.