గాదె సమక్షంలో జనసేనలో చేరికలు

*నగరంలో మరిన్ని చేరికలు ఉంటాయి

గుంటూరు: గుంటూరు కార్పొరేషన్ 20వ వార్డ్ సంపత్ నగర్ వాసులు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు సమక్షంలో జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. వీరికి జిల్లా అధ్యక్షులు పార్టీ కండువాలను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి.. పార్టీ బలోపేతమే లక్ష్యంగా.. అందరూ కలసి పనిచేయలన్నారు.

కొలసాని బాలకృష్ణ ఆధ్వర్యంలో పార్టీలో చేరిన గురజాల హరిబాబు, లింగిశెట్టి సాయి, ఈగ సాంబమూర్తి, అంబటి వెంకట్రావు, ఎస్ కె ఆజాద్, తుమ్మలచెరువు ఉదయ్ చంద్ర, ఎస్ కె సాదిక్ బాబు, సింగల్ శెట్టి హరి సత్యనారాయణ, ఆకుల సాంబశివరావు పార్టీ లో జాయిన్ అవ్వడం జరిగింది. వీరంతా పార్టీ లో చేరడం పార్టీ బలోపేతం అవుతుందనడానికి నిదర్శనమని చెప్పారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా జనరల్ సెక్రెటరీ నాగదాసు రామచంద్ర ప్రసాద్, దాసరి వెంకటేశ్వరావు పాల్గొన్నారు.