తాడేపల్లిగూడెంలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

తాడేపల్లిగూడెం, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశానుసారం శనివారం తాడేపల్లిగూడెంలో సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కార్యకర్తల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రమాదంలో గాయపడిన వారికి వైద్యఖర్చుల నిమిత్తం రూపాయలు 50000/-, ఒకవేళ ప్రమాదంలో మరణిస్తే వారి కుటుంబ సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఐదు లక్షల ఆర్థిక సహాయం అందేవిధంగా ప్రమాదబీమా సౌకర్యం కల్పించడం వారి గొప్ప ఆలోచనా విధానానికి నిదర్శనం. ఈ సందర్భంగా సభ్యత్వాలు చేర్పించడంలో ఎంతో ఉత్సాహంగా పనిచేసిన తాడేపల్లిగూడెం రూలర్ మరియు మండల వాలంటీర్లను తాడేపల్లిగూడెం జనసేన ఇంఛార్జ్ అయిన బొలిశేట్టి శ్రీనివాస్ ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం జనసేన నాయకులు, జనసేన వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.