గోరంట్లలో ఘనంగా జనసేన పార్టీ సభ్యత కిట్ల పంపిణీ

అనంతపురం జిల్లా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి ల పిలుపు మేరకు శనివారం గోరంట్ల మండలంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కిట్ లు పంపిణీ చేయడం జరిగింది. జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్ అబు, జిల్లా కార్యదర్శి సురేష్ చేతుల మీదుగా ఈ కిట్ల పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఎక్కువ సభ్యత్వాలు చేసినందుకు గాను ఎముకలగుట్టపల్లి వెంకటేష్, సంతోష్ లని నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఏ పార్టీ చేయని విదంగా పవన్ కళ్యాణ్ 5లక్షల ఇన్సూరెన్స్ చేపించారు కార్యకర్తల గురించి పవన్ కళ్యాణ్ ఎంతో ఉన్నతంగా ఆలోచిస్తున్నారు అలాగే రాష్ట్ర ప్రజల కోసం పవన్ కళ్యాణ్ పోరాడుతున్నారు చనిపోయిన కౌలు రైతులు కోసం 30 కోట్ల రూపాయలు తన సొంత నిధులు ఇచ్చారు కావున ఆయన చేస్తున్న కార్యక్రమాలని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి 2024లో పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమల జిల్లా కమిటీ సభ్యుడు పి.వెంకటేష్, పెనుకొండ నియోజకవర్గ ఐటి కో-ఆర్డినేటర్ యోగనంద రెడ్డి, మండల సీనియర్ నాయకులు వెంకటేష్, సంతోష్, గొల్ల అనీల్ కుమార్, బండారు మల్లికార్జున బాబావలి, గంగరాజు, నరేష్, వసీం, నాగేష్, తిరుపాల్, రమణ, రమేష్, రంగనాథ్, శంకర తదితరులు పాల్గొన్నారు.