పాలకొండలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణి

పాలకొండ నియోజకవర్గ స్థాయిలో జనసేనపార్టీని బలోపేతం చేసే దిశగా ఆదివారం పాలకొండలో బామిని మండల జనసేన నాయకులు కిషోర్, పాలకొండ టౌన్ జనసైనికులు ప్రశాంత్ పోరెడ్డీ, పొట్నురు రమేష్ మరియు జనసైనికులు పాల్గొని పార్టీ సిద్దాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళాలని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత డబ్బులతో కౌలు రైతులకు 30 కోట్లు ఆర్ధిక సహాయం చేస్తున్న విషయాన్ని రైతులకు అర్థమయ్యే విధంగా మనమందరం కలిసి రైతులకు వివరించి జనసేనపార్టీని పాలకొండ నియోజకవర్గ పరిధిలో బలపరచలని నిర్ణయించుకున్నాం. ఈ విధంగా ప్రతి జనసైనికుడు తమ గ్రామస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా కృషి చేయాలని కోరుకుంటున్నామని అన్నారు. జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.