జనసేన అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించండి

అరకు నియోజకవర్గం, అరకు వేలి మండలం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో జనసేనపార్టీ ముఖ్యనాయకులు సమావేశమయ్యారు. ఈ సందర్భముగా మాదాల శ్రీరాములు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో అన్ని మండలాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెప్టెంబర్ 2 వ తేదీన అన్ని ప్రాంతాల్లో పుట్టినరోజు పురస్కరించుకుని సేవా కార్యక్రమాలు చేయాలి. వస్త్రదానంం అన్నదానం, అనాధ ఆశ్రమాలకు తోచినంత సహాయం చేయండి అని మాదాల శ్రీరాములు పిలుపునిచ్చారు. జనసేనపార్టీ అద్వర్యంలో పేద విద్యార్థులకు వృద్ధులకు సహాయం చేయండి. పుట్టినరోజు వేడుకలు పండగలా గిరిజన ప్రాంతంలో జరుపుకోవాలని తెలిపారు. జనసేనపార్టీ బలోపేతానికి కార్యకర్తలు అందరూ కృషి చేయాలని ఈ సందర్భముగా సమావేశంలో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ వర్కింగ్ కమిటీ సభ్యులు కొనెడి లక్ష్మణరావు, రెడ్డి చిన్నారావు, సంతోష్ సింగ్, రామకృష్ణ, కొటేశ్వరవు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. జనసేనపార్టీ అధినేత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించి కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు.