నకరికల్లు రోడ్డు సమస్యపై కలెక్టర్ కు జనసేన వినతి పత్రం

సత్తెనపల్లి నియోజకవర్గం: నకరికల్లు గ్రామ రోడ్డు సమస్యపై పల్నాడు జిల్లా కలెక్టర్ కు సోమవారం నకరికల్లు మండల జనసేన పార్టీ అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్ వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా లక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ.. నకరికల్లు మండలం, నకరికల్లు గ్రామంలో 700 మీటర్లు సిసి రోడ్డు హైవే నుండి పాతూరులోని మసీదు వరకు రోడ్డు చాలా దుర్ఘందంగా, గోతులతో, గుంతలతో నిండి ఉంది. వర్షం పడితే గుంతలు కనిపించడం లేదు. వర్షపు నీరు గుంతల్లో నిలబడుతూ సీసీ రోడ్లు మొత్తం పగిలిపోయి అద్వాన్నంగా ఉన్నది. ఈ సమస్యతో నకరికల్లు గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. కనుక ఈ సమస్యను పరిష్కరించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షురాలు తాడువాయి లక్ష్మి శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు షేక్ రఫీ, నకరికల్లు గ్రామ సీనియర్ నాయకులు కాసా రామకృష్ణ, మల్లాల రాఘవయ్య, షేక్ నాగుల్, షరీఫ్ పాల్గొని జిల్లా జాయింట్ కలెక్టర్ కు వినత పత్రాన్ని అందించడం జరిగినది.