పెద్దగుజ్జువాడలో జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

నరసన్నపేట నియోజకవర్గం: జనసేన పార్టీ కార్యకర్తల క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ కార్యక్రమం సారవకోట మండలం, పెద్దగుజ్జువాడలో జరిగిందని జనసేన నరసన్నపేట నాయకులు జయరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. సోమవారం జయరామ్ విలేకరులతో మాట్లాడుతూ.. నరసన్నపేట నియోజకవర్గ జనసైనికులకు జనసేన ప్రమాద బీమా, జనసేన సిద్ధాంతాలకు విశిష్ట స్పందన లభించిందన్నారు. సుమారు 1500 లకు పైగా నియోజకవర్గంలో జనసైనికులు క్రియాశీల సభ్యత్వం తీసుకోవడం ఒక మైలు రాయి అని, కార్యకర్తలకు క్రియాశీల కిట్ లో, పవన్ కళ్యాణ్ మనోగతం పుస్తకం, స్థానిక సమస్యలు పొందుపరచడం కోసం నోట్ బుక్, పార్టీ గుర్తు గాజు గ్లాస్, క్రియశీల కార్యకర్త ఐడి కార్డ్ తో కూడిన కిట్ లను కార్యకర్తలకు, నాయకులకు మరియు క్రియాశీల వాలంటీర్లకు అందజేయటం జరిగిందన్నారు. పార్టీ బలోపేతం కోసం అందరం కలసి కట్టుగా పని చెయ్యాలని, పార్టీ సిద్ధాంతాలతో తప్ప, సొంత అజెండాలతో పని చేయొద్దని, ఇతరుల ప్రలోభాలకు లోనూ కాకుండా ఉండా లన్నారు. ఈ కార్యక్రమంలో సారవకోట మండల నాయకులు గ్రామ జనసైనికులు పాల్గొన్నారు.