జనం కోసం జనసేన, మహాపాదయాత్రకు అడుగడుగునా జననీరాజనం..!

  • రాష్ట్రం మనది.. భవిత మనది.. రాష్ట్ర అభివృద్ధికి జనసేన తరపున మన వంతు కృషిని నిబద్ధతతో చేద్దాం
  • వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ కోసం అందరూ సమైక్యంగా పోరాడాలి.. బత్తుల
  • రాజానగరం నియోజకవర్గాన్ని అవినీతిరహిత నియోజకవర్గంగా తీర్చిదిద్దుదాం!
  • జి. యర్రంపాలెం గ్రామంలో జనసేన పార్టీకి ప్రజల నుండి ఏకపక్షంగా పెద్ద ఎత్తున మద్దతు!
  • జన నీరాజనాలతో ముందుకు సాగిన జనంకోసం జనసేన మహాపాదయాత్ర
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీకి ఒక అవకాశం ఇచ్చి ప్రజా పరిపాలన తీసుకురావాలని కోరిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి

రాజానగరం నియోజకవర్గం: రాజానగరం మండలం, జి. యర్రంపాలెం గ్రామంలో శుక్రవారం నిర్వహించిన ‘జనం కోసం జనసేన’ ‘మహా పాదయాత్ర’ ను నిర్వహించిన శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మికి గ్రామ ప్రజానీకం స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఏకపక్షంగా మద్దతు తెలియజేసి, రానున్న ఎన్నికల్లో పూర్తిగా జనసేన పార్టీ పక్షాన నిలబడి బత్తుల బలరామకృష్ణ నాయకత్వాన్ని బలపరిచి పవన్ కళ్యాణ్ గారి ప్రజా పరిపాలన కోసం ఎదురుచూస్తున్నామని వారే చెప్పడం చూస్తుంటే ప్రజలు ఏ స్థాయిలో మార్పు కోరుకుంటున్నారో అర్థం అవుతుంది. యువత కేరింతలతో, అడుగడుగునా మహిళల హారతులతో ప్రజానీకం జనసేన పార్టీకి బ్రహ్మరథం పట్టేలా సుదీర్ఘంగా సాగింది ఈ ‘మహాపాదయాత్ర’. ఈ కార్యక్రమంలో జి.యర్రంపాలెం జనసేన సీనియర్ నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, మండల నాయకులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.