పోలేరమ్మ తిరునాళ్ళలో జనసేన మజ్జిగ పంపిణీ

ప్రత్తిపాడు నియోజకవర్గం, కాకుమాను మండలం, కొండపాటూరు గ్రామంలో పోలేరమ్మ తిరునాళ్ళ సందర్భంగా కాకుమాను మండల జనసేన పార్టీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ప్రధాన కార్యదర్శి ఉప్పు రత్తయ్య, జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాధ్, జిల్లా నాయకులు కొర్రపాటి నాగేశ్వరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 లీటర్లు మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకుమాను మండల అధ్యక్షులు గడ్డం శ్రీనివాసరావు, మండల నాయకులు రెడ్డి నాగరాజు, సోమరౌతు రాజా, ఒట్టికూటి నాగార్జున మరియు మండల నాయకులు, గ్రామ అధ్యక్షులు, జనసేన పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.