విద్యార్ధులకు జనసేన గ్లాసుల పంపిణీ

విజయనగరం జిల్లా, గజపతినగరం నియోజకవర్గం, దత్తి రాజేరు, ఎస్.బూర్జి వలస గ్రామం, ఎలిమెంటరీ స్కూల్ 30 మంది విద్యార్థులకు రాగి జావ తీసుకొనుటకు పిల్లలు ఇంటికి వెళ్లి రావడం చూసి వాళ్ల ఇబ్బందులు గ్రహించి జనసేన పార్టీ మండల అధ్యక్షులు చప్ప అప్పారావు స్కూల్ మాస్టర్ తో మాట్లాడి గ్లాసులు పంపిణీ చేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్య నిర్వహణ కమిటీ మామిడి దుర్గాప్రసాద్ మరియు జనసేన నాయకులు మరడ దుర్గారావు, బోను తిరపతి, కిక్కర భాస్కరరావు స్కూల్ టీచర్స్ పాల్గొనడం జరిగినది.