ఎన్.డి.ఏ గెలుపే జనసేన లక్ష్యం

  • పార్వతీపురం మండలంలో గ్రామ బాట

పార్వతీపురం నియోజకవర్గంలో, పార్వతీపురం మండలంలో జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగూరు మణి అధ్యర్యంలో జనసేన పార్టీ మండల టీం గ్రామ బాట చేపట్టింది. రానున్న ఎన్నికల్లో పార్వతీపురం మండలంలో గల గ్రామ పంచాయితీలలో జనసేన గ్రామ బాట కార్యక్రమం గత నాలుగు రోజులుగా జరుగుతుంది అందులో భాగంగా రావికోనా పంచాయతీలో రావికోన, బట్టి వలస, రాగాలగూడ గ్రామాలలో గ్రామ బాట నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన మండల అధ్యక్షురాలు ఆగూరు మణి ఆదేశాల మేరకు జనసేన నాయకులు మాట్లాడుతూ.. ముఖ్యంగా సూపర్ సిక్స్ పధకాలు ఆవశ్యకతను గూర్చి వివరించారు. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బోనుల విజయ్ చంద్రని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని గ్రామ ప్రజలను కోరారు అలాగే ఉమ్మడి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు అలాగే గ్రామ పెద్దలు, యువతతో కలిసి గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రోడ్డు, పెన్షన్లు, రక్షిత త్రాగునీరు, ఆగిన ఇల్ల, కాలువలు, పారిశుద్ధ్యం గురించి పరిష్కారించే దిశగా కృషి చేస్తామని హామి ఇచ్చారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు జిల్లా కార్యక్రమాల కార్య నిర్వహణ కార్యదర్శి చిట్లు గణేశ్వరరావు ఖాతా విశ్వేశ్వరరావు, అక్కెన భాస్కరరావు, బండపల్లి జనార్దన్ (జానీ) రవి, అన్న బత్తుల దుర్గాప్రసాద్, సంతు, తేజ, పాలీల మన్మధ, కుమ్మరి జగదీష్, లక్ష్మీనారాయణ దుంకి, ఆగూరు మహేష్, మరియు తెలుగు దేశం పార్టీ స్థానిక నాయకులు తదితరులు మరియు ఆ గ్రామ పెద్దలు, యువత అందరూ పాల్గొని విజయవంతం చేశారు.