బొగిడియా పుట్టుగ గ్రామంలో జనసేన సభ్యత్వ కీట్ల పంపిణి

ఇచ్ఛాపురం, కవిటి మండలం బొగిడియా పుట్టుగ గ్రామంలో పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జనసేన సభ్యత్వ భీమా కిట్లను ఇచ్ఛాపురం సమన్వయకర్త దాసరి రాజు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంను ఉద్దేశించి దాసరి రాజు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతీ జనసైనికుడి కుటుంబానికి ఒక పెద్ద కొడుకుగా అండగా ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ 5 లక్షల ప్రమాద భీమాను ఏర్పాటు చేశారని, ఇచ్చాపురం నియోజకవర్గంలో అన్ని వనరులు ఉన్నప్పటికీ కూడా వలసలు వెళ్లడానికి కారణం ఇక్కడ నాయకుల నాయకత్వ లోపం, అలాగే పేద ప్రజల తరుపున జనసేన పార్టీ పోరాడుతుందని, జనసేన పార్టీ అధికారంలోకి వస్తేనే పేదల కష్టాలు తీరుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ జనసేన 10 వ వార్డు ఇంఛార్జి రోకళ్ళ భాస్కర్, గ్రామ జనసైనికులు చందు, శంకర్, పురుషోత్తం, పీతాంబర్, నారాయణ, వాసు, రాజశేఖర్, దివాకర్, సిసింద్రీ, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.